రేపూరులో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు
కాకినాడ రూరల్, మే 12,
కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామంలో వెలసిన శ్రీ పంచముఖ అభయ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం హనుమ నామస్మరణతో మారుమోగింది.ఉదయం నుంచే ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
మంటపారాధనలు, నిత్య హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.ముమ్మిడి బుజ్జి బ్రదర్స్ ఆధ్వర్యంలో వివిధ రకాల పండ్లు, అరటి చెట్లతో ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య వరప్రసాద్ పర్యవేక్షణలో స్వామివారికి తమలపాకులతో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.వేడుకల్లో భాగంగా మధ్యాహ్నం సుమారు 4 వేల మంది భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేశారు.స్వామివారి కృపతో వేడుకలు దిగ్విజయంగా జరిగాయి. భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పించాం అని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.



