​తిరుమల, మార్చి 16: (పిన్ పాయింట్) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని ఎదురుచూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక సమాచారం అందించింది. 2026 జూన్ నెలకు సంబంధించిన వివిధ రకాల దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు మరియు వసతి గదుల కోటాను విడుదల చేసే షెడ్యూల్‌ను టీటీడీ ప్రకటించింది. ​భక్తుల సౌకర్యార్థం విడుదల తేదీలు మరియు సమయాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి: ​ఆర్జిత సేవలు - లక్కీ డిప్ (మార్చి 18) ​సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి ఆర్జిత సేవా టికెట్ల కోసం మార్చి 18న ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన వారు మార్చి 22 మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లించాల్సి ఉంటుంది. ​సాధారణ ఆర్జిత సేవలు (మార్చి 21) ​కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ మరియు జ్యేష్ఠాభిషేకం టికెట్లను మార్చి 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటాను విడుదల చేయనున్నారు. ​అంగప్రదక్షిణ & శ్రీవాణి టికెట్లు (మార్చి 23) ​అంగప్రదక్షిణ టోకెన్లు: మార్చి 23న ఉదయం 10 గంటలకు. ​శ్రీవాణి ట్రస్టు టికెట్లు: మార్చి 23న ఉదయం 11 గంటలకు. వృద్ధులు/దివ్యాంగుల కోటా: మార్చి 23న మధ్యాహ్నం 3 గంటలకు ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లు విడుదలవుతాయి. ​రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం & వసతి (మార్చి 24) ​ప్రత్యేక ప్రవేశ దర్శనం (SED): మార్చి 24న ఉదయం 10 గంటలకు. వసతి గదుల కోటా: తిరుమల మరియు తిరుపతిలో గదుల బుకింగ్ మార్చి 24న మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది.భక్తులు అధికారిక వెబ్‌సైట్ ​ద్వారా మాత్రమే తమ టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
ADVERTISEMENT Ad 👆 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి